పింక్‌ బాల్‌ టెస్ట్‌; బంగ్లా బ్యాటింగ్‌

కోల్‌కతా: భారత గడ్డపై తొలిసారిగా పింక్‌ బాల్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ నేడు ప్రారంభమైంది. టీమిండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌ టీమ్‌లో రెండు మార్పులు జరిగాయి. తైజూల్‌, మెహిదీ స్థానంలో ఆల్‌-అమీన్‌, నయీమ్‌ జ​ట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్‌కతా నగరం గులాబీ మయంగా మారింది. పింక్‌ బాల్‌తో తొలిసారిగా మన దేశంలో జరుగుతున్న టె​స్ట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఈడెన్‌ గార్డెన్స్‌కు అభిమానులు పోటెత్తారు.